విశాలాంధ్ర,వలేటివారిపాలెం : జగనన్న సురక్ష పధకం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కావలసిన సేవలను అందించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పధకాన్ని ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం నుండి శుక్రవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు జెడ్పిటీసీ ఇంటూరి భారతి, ఎంపీపీ పొనుగోటి మౌనిక,ఈఓపీఆర్డీ సుమంత్, సీహెచ్ఓ.శివరామయ్య,అధికారులు, నాయకులుఇంటూరి హరిబాబు,పరిటాల వీరాస్వామి,అనుమోలు వెంకటేశ్వర్లు వీక్షణా కార్యక్రమానికి హాజరైనారు ఈ సందర్బంగా జెడ్పిటీసీ ఇంటూరి భారతి మాట్లాడుతూ అధికారులు, వలంటీర్లు,గృహసారధులు,సచివాలయకన్వీనర్లు ప్రతిఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. అర్హత ఉండి పధకం అందని లబ్దిదారులను గుర్తించి వారికి పధకాలు అందించడమే ఈపధకం లక్ష్యమన్నారు. జగనన్నకు చెబుదాం అర్జీదారులను గుర్తించి ఈపధకంద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, పరిష్కారం కాని వాటికి అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరంగా తెలియజేయాలని తెలిపారు. మన జగనన్న ప్రభుత్వంలో అర్హులై ఉండి సేవలు గాని,ప్రభుత్వ లబ్ది పొందని వారిని జల్లెడ పట్టి వారికి కావాల్చిన పత్రాలు అందించి వారికి మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష కార్యక్రమం అని అన్నారు ఈ కార్యక్రమం జులై 1తేదీ నుండి 30తేదీ వరకు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది సచివాలయం కన్వీనర్లు పాల్గొన్నారు.