విశాలాంధ్ర- కర్నూల్ సిటీ : తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు శాఖ నిర్వహించిన యోగా పోటీలలో రవీంద్ర పాఠశాలల విద్యార్థులు వివిధ విభాగాలలో పథకాలు సాధించి ప్రతిభ కనపరిచారు. 14,16 సంవత్సరాల బాలికల విభాగంలో రవీంద్ర బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని జి.ఎస్. శ్రీలక్ష్మి మొదటి బహుమతిని సాధించారు. బాలుర విభాగంలో 10..12 సంవత్సరాల కేటగిరిలో ఆరవ తరగతి చెందిన సి.లిఖిత్ ద్వితీయ,.8..10 సంవత్సరాల బాలుర విభాగంలో నాలుగో తరగతికి చెందిన సి. సాకేత్ మూడవ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య పథకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ పథకాలు సాధించడానికి ప్రేరేపించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ,యోగా మాస్టర్ ను రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య తోపాటు, విద్యాసంస్థల చైర్మన్ జి.వి.యం. మోహన్ కుమార్ , అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్. మమతా మోహన్లు శుభాకాంక్షలు తెలియజేశారు.