విశాలాంధ్ర – కర్నూలు సిటీ : విద్యుత్ శాఖలో అన్ని విభాగాల్లోని ఉద్యోగులను, కార్మికులను బెదిరించే విధంగా ఎస్ ఈ ఉమాపతి మాట్లాడుతున్నారని, ఆయన వ్యవహార శైలి మార్చుకోకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని 1104 యూనియన్ నాయకులు హెచ్చరించారు. స్థానిక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యాలయంలో 1104 యూనియన్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూర్నూలు సూపరింటెండింగ్ ఇంజనీరు జూన్ 20న ఓ అండ్ ఎమ్ కార్మికులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఎస్ ఈ అసభ్యకరంగా వ్యవహరించారన్నారు. ఎస్ ఈ వ్యవహారం వల్ల కార్మికులో పని ఒత్తిడి పెరిగి ప్రమాదాలకు గురౌతున్నారన్నారు. ఇది చాలా రోజుల నుండి అన్ని రంగాల ఉద్యోగులను, ఇంజినీర్లు,అకౌంట్స్ ఉద్యోగులను, ఓఅండ్ ఎమ్ కార్మికులను, ఎనర్జీ అసిడెంట్లను కాంట్రాక్టు కార్మికులను బెదిరిస్తున్నారన్నారు.యూనియన్ నాయకులుగా వ్యవహార శైలి మార్చుకోవాలని, ఎస్ ఈ కి సూచించిన పద్దతి మార్చుకోలేదన్నారు. అదేవిధముగా ఆయన వ్యవహరిస్తే 1104 యూని యన్ జిల్లా సమావేశము ఏర్పాటుచేసుకుని ఆయన వ్యవహారాలపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు హెచ్చరించారు. సమావేశములో ప్రాంతీయ అధ్యక్షులు భాస్కర్రావు, ప్రాంతీయ కార్యదర్ని గణేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామలయ్య, అదనపు కార్యదర్శి సతీష్ ,ఆదోని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.