విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోకూరు ప్రధానోపాధ్యాయులు ఎం రవీంద్ర తమ పాఠశాలకు ఫీడర్ పాఠశాలలైన మండల ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు విద్యార్థుల కొరకు శనివారం కొండసముద్రం, కూని పాలెం మరియు మాలకొండ రాయుని పాలెం గ్రామాలకు వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి ప్రభుత్వం చేపడుతున్న జగనన్న గోరుముద్ద జగనన్న విద్యా కానుక అమ్మబడి తదితర పథకాలను పొంది ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి ఉత్తమమైన విద్యను అభ్యసించాలని తద్వారా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వర్తిస్తున్న త్రిబుల్ ఐటీ చదువును అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మరియు సిఆర్పి పాల్గొన్నారు.