26 తీర్మానాలకు స్థాయీ సంఘం అమోద ముద్రా
అభివృద్ధి పనులకు రూ.8.30 కోట్లు కేటాయింపు
నగరంలోని 47 బస్ షెల్టర్ల ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్
కిడ్స్ వరల్డ్ కూడలిలో టవర్ క్లాక్ నిర్మాణం
విశాలాంధ్ర – కర్నూలు సిటీ : నగరం నలుదిశలా అభివృద్ధిని విస్తరిస్తున్నామని నగర మేయర్ బి.వై. రామయ్య పేర్కొన్నారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో స్థాయీ సంఘ సమావేశం జరిగింది. కమిషనర్ ఏ.భార్గవ్ తేజ, సభ్యులు పల్లవి, సాన శ్రీనివాసులు, వైజ అరుణ, మల్లికాబేగం, రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.సమావేశంలో మొత్తం 26 తీర్మానాలను ఆమోదించగా, రూ.8.30 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించారు. ఇందులో ప్రధానంగా నగరంలో ఉన్న 47 బస్ షెల్టర్లకు మరమ్మతులు, మాంసపు వ్యర్థాలను సేకరించేందుకు టెండర్ పిలుచుట, 15 ఎం.ఎల్.డి. వద్ద జనరేటర్ కొనుగోలు, రూం నిర్మాణానికి రూ.62 లక్షలు, అల్లూరి సీతారామరాజు నగర్ నందు కెసి కెనాల్ ఇరువైపులా అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు, బుధవారపేటలో మెడికల్ కాలేజీ నుండి స్మశానం వరకు రూ.49.80 లక్షలతో 150 డబ్లూ. ఎల్.ఈ.డి. లైటింగ్ ఏర్పాటు,కిడ్స్ వరల్డ్ కూడలిలో టవర్ క్లాక్ ఏర్పాటుకు రూ.50 లక్షలు,నగరంలోని 17వ వార్డుకు రూ.35 లక్షలు, 19వ వార్డుకు రూ.75 లక్షలు, 20వ వార్డుకు రూ.30 లక్షలు, 21వ వార్డుకు రూ.50 లక్షలు, 31వ వార్డుకు రూ.35 లక్షలు, 35వ వార్డుకు రూ.49.50 లక్షలు, 8వ వార్డుకు రూ.20 లక్షలు, 22వ వార్డుకు రూ.30 లక్షలు, 24వ వార్డుకు రూ.40 లక్షలు, 23వ వార్డుకు రూ.30 లక్షలు, 45వ వార్డుకు రూ.49 లక్షలు, 46వ వార్డుకు రూ.40 లక్షలు 48వ వార్డుకు రూ.48 లక్షలను వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ తీర్మానాలను ఆమోదం తెలిపారు. సమావేశంలో ఎం.హెచ్.ఓ. విశ్వేశ్వర రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, డిసిపి మోహన్, ఎంఈలు శేషసాయి, షాకీర్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, సినియర్ అసిస్టెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.