విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని గన్నే వారి పల్లి కాలనీలో గురువారము ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి ఆఫీస్ నందు తన కూతురు ఉమ్మడి అశ్విత పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి గురు ప్రసాద్ సేవా ట్రస్ట్ ప్రారంభించినట్లు సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సంపాదించిన దాంట్లో ఉడతా భక్తిగా కుల మతాలకతీతంగా పేద ప్రజలకు సేవ చేయాలని తన ఆకాంక్ష అందులో భాగంగానే తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గన్నెవారిపల్లె కాలనీలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ క్రింద పడి చనిపోయిన చైతన్య తల్లి సంధ్యకి 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు కురువ రామశేఖర్ మాట్లాడుతూ ట్రస్ట్ ప్రారంభించడం అభినదించ దగ్గ విషయం అని,ట్రస్ట్ కి నా సహకారం ఎప్పుడూ ఉంటుంద న్నారు.13 వార్డు కౌన్సిలర్ మారపు రెడ్డి రంగనాథ రెడ్డి మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ఎంతోమంది పేదలకు ఆసరాగా నిలవాలని ఎన్నో మంచి సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో సుధీర్, భాస్కర్,శివారెడ్డి, రాజా, మాబువలి, హుస్సేన్, గణేష్, దస్తగిరి, విజయ్, గురునాథ్, రవి, అగ్గిరప్ప, ఆనంద్, బీసీ ఓబులేసు పాల్గొన్నారు.