విశాలాంధ్ర- బుక్కరాయసముద్ర: విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా శుక్రవారం బి కే ఎస్ సబ్స్టేషన్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి నారాయణస్వామి, కార్యదర్శి మరి స్వామి ముట్టడించారు. అనంతరం ఏఈ ప్రతాప్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్ల అన్నదాతలకు ఉరితాలు వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతూ ఉందన్నారు. బినామీ కంపెనీలతో రహస్య ఒప్పందలు చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు నల్లప్ప, కుల్లాయప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు బండి రామకృష్ణ,వ్యవసాయ కూలీ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, నాగమణి, వెంకట్, మునీర్, తిప్పేస్వామి, హరికృష్ణ, నాగేంద్ర, మధు పాల్గొన్నారు.