విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని దొడ్డిమేకల, బసలదొడ్డి గ్రామాల్లో శనివారం తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వాలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించి అధికారుల దృష్టికి తెస్తారు. గ్రామంలో కుల, ఆదాయ, ధృవీకరణ పత్రాలు, 1బి, అడంగల్ పత్రాలను తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ మహేష్ ఈఓఆర్డి జనార్ధన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివరామిరెడ్డి, యంకప్ప స్వామి తదితరులు పాల్గొన్నారు.