విశాలాంధ్ర- కర్నూల్ సిటీ : నగరంలోని వైయస్సార్ సర్కిల్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల దృష్ట్యా పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, డిఈ రాజా మోహన్ రెడ్డిలు తెలిపారు. పవర్ హౌస్ విభాగం పరిధిలో జూలై 2న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎలక్ట్రికల్ లైన్, పోల్ షిఫ్టింగ్ పనులు చేపడతారని, ఈ కారణంగా బాబు జగ్జీవన్ రామ్ నగర్, గిబ్సన్ కాలనీ, ఈశ్వర్ నగర్, ఎన్ ఆర్.పేట,ఇసీఎం కాంపౌండ్, సంకల్ బాగ్ పరిసరాల ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు.