విశాలాంధ్ర – ఆస్పరి : మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య, మండల కార్యదర్శి విరుపాక్షి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య లు డిమాండ్ చేశారు. శనివారం ఇసుక అక్రమ రవాణా పై తాసిల్దార్ కుమారస్వామి,ఎస్సై వరప్రసాద్ లకు వేరువేరుగా వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోనే వెంగళాయ దొడ్డి చెరువులో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారుల విఫలమయ్యారన్నారు. చెరువు చుట్టుపక్కల రైతులు ఇసుకను తరలించవద్దు అని అడ్డుపోతే రైతులపై బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో ఇసుకను తరలించడం వలన రైతులు పొలాల్లోని నీరు ఇంకిపోయే ప్రమాదం ఉందన్నారు. రాత్రింబగళ్ళు ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ గ్రామాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని, వీరికి అడ్డు అదుపు లేకుండా పోయిందని అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠినంగా శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు ఉరుకుందప్ప, పులికొండ, దస్తగిరి, కావలి ఉరుకుందప్ప, రంగన్న, ఆవులన్న, ఈరన్న, రంగస్వామి, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.