సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పంచాయతీలకు నిధులు, విధులు లేకుండా నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆందోళన చేపట్టిన సర్పంచ్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఏమాత్రం గౌరవమున్నా 14, 15 ఆర్థికసంఘం నిధులను తక్షణమే పంచాయతీలకు అప్పగించి… సర్పంచ్లకు క్షమాపణ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికశాతం పంచాయతీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. సర్పంచ్ల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా దయనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లకు విలువ లేకుండా పోవడం విచారకరం. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన 14, 15 ఆర్థికసంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం లాగేసుకోవడంతో సర్పంచ్లు ఆందోళనబాట పట్టారు. సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన సర్పంచ్లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. పంచాయతీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం ఇతర శాఖలకు బదలాయించడం వల్ల పంచాయతీల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులు వంటి చిన్న పనులు సైతం చేయించలేని పరిస్థితిలో సర్పంచ్లు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజలకు సేవ చేయడంలో జగన్ సర్కార్ కలిగిస్తున్న అడ్డంకులతో ఆందోళన చెందిన 20 మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయం. అయినప్పటికీ సీఎం జగన్కు చీమకుట్టి నట్టయినా లేకపోవడం విచారకరం. జగన్కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సర్పంచ్లకు క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు జమ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.