Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రైతులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి

పోలీస్ స్టేషన్లో నిరసన తెలిపిన ఎమ్మెల్యే కేశవ్

విశాలాంధ్ర- ఉరవకొండ : గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన అన్ని రకాల పంటలకు బీమా వర్తింపచేయాలని కోరుతూ మంగళవారం ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామ సమీపంలో 42వ జాతీయ రహదారిపై ఆందోళన చేసిన రైతులపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకొని రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. కేసులు ఎత్తివేసే వరకు తాము వెళ్ళమని భీష్మించుకు కూర్చున్నారు. పంటలను నష్టపోయిన రైతులు పరిహారం అడిగితే కేసులు ఎలా నమోదు చేస్తారని వారు ఏమైనా నేరస్థల అని పోలీసులను ఆయన ప్రశ్నించారు. కేసులను ఎత్తివేయకపోతే రైతులతో కలిసి జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోవాలని అన్నారు. దీనిపై స్పందించిన ఉరవకొండ సీఐ హరినాథ్ మాట్లాడుతూ రైతులపై నమోదైన కేసులు ఎత్తివేసేందుకు తాము ఉన్నతాధికారులతో చర్చిస్తామని శనివారం వరకు గడువు ఇవ్వాలని పేర్కొన్నారు కేసులు ఎత్తివేయకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంటలను నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఆందోళన చేస్తే వారిని వేధించే విధంగా కేసులను నమోదు చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని తమపై కేసులు నమోదు చేయొద్దని రైతులు పోలీసులు కాళ్లు పట్టుకున్నప్పటికీ కూడా కనికరం లేకుండా పోలీసులు కేసులను నమోదు చేయడం బాధాకరమన్నారు. రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా తమకు పరిహారం ఇవ్వాలని ఆవేదనతో ఆందోళన చేస్తే కేసులు నమోదు చేయడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేక నియంతల పాలనలో ఉన్నామా అని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమంది ప్రతిపక్ష నాయకులు పంటల బీమా కోసం,పరిహారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని ఏ ఒక్కరిపై కూడా కేసులు నమోదు చేయలేదన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసే వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తుందని పేర్కొన్నారు. రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం తాము కేసులకి భయపడమని జైలుకు వెళ్లడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఎంతమంది మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారో చూస్తామని కేశవ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img