విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- అమ్మనబ్రోలు గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు గుండం కట్ట చెరువు పక్కన ఉన్న గురుకుల పాఠశాలకు వెళ్లే దారిలోని పోలేరమ్మ తల్లి దేవాలయ ప్రధాన గేటు తాళం పగలగొట్టి గుడిలోకి ప్రవేశించిన దొంగలు ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు ఉదయాన్నే గుర్తించిన స్థానికులు చోరీ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.