విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- మండల కేంద్రమైన నాగులుప్పలపాడు గ్రామపంచాయతీకి మంజూరైన పారిశుధ్య ట్రాక్టర్ ను బుధవారం ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు మండల పార్టీ అధ్యక్షులు పోలవరపు శ్రీమన్నారాయణ ఎంపీటీసీ మారెళ్ళ మహాలక్ష్మి సర్పంచ్ మంద హెప్సీబా కార్యదర్శి రవికుమార్ జూనియర్ అసిస్టెంట్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.