విశాలాంధ్ర – తాడిపత్రి : పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివసిస్తున్న స్పాట్ న్యూస్ జర్నలిస్ట్ కరీముల్లాకు జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి 20 వేల రూపాయలు ఆర్థిక సాయం అంద జేశారు. బుధవారం జనసేన నియోజక వర్గం ఇంచార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి స్పాట్ న్యూస్ జర్నలిస్ట్ కరీముల్లా తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొని కరీముల్లా ఇంటికి వెళ్లి కరీముల్లా తల్లి బోతికాయా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. జర్నలిస్ట్ కరీముల్లాను కుటుంబీకులను ఓదార్చి ఉడతా భక్తిగా తనకు తోచిన సహాయంగా ఆర్థిక సహాయం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పాట్ న్యూస్ జర్నలిస్ట్ కరీముల్లా తల్లి అనారోగ్యం కారణంగా మంగళవారం అర్ధరాత్రి మృతి చెదడం బాధాకర విషయం అన్నారు.