విశాలాంధ్ర, పెద్దకడబూరు : బడి భోజనంలో నాణ్యత పాటించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు వంట ఏజెన్సీని ఆదేశించారు. గురువారం జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గవిగట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మద్యాహ్న భోజనాన్ని ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఆర్ఐ మహేష్, గ్రామ సర్పంచ్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మద్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని, మెనూ ప్రకారం భోజనాన్ని తయారు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదిరెడ్డి, మహాదేవ, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.