మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పేద ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లను అందజేయడమే జగనన్న సురక్ష లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బండి శేషన్న, మాట్లాడుతూ గురువారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గూడ్స్ కొట్టాల శారద నగర్ సచివాలయములకు కెవిఎస్ స్కూల్ వద్ద, అదేవిధంగా చంద్రబాబు నగర్, శాంతినగర్, బత్తలపల్లి రోడ్డు సచివాలయములకు మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది అని తెలిపారు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం రెండు చోట్ల చైర్పర్సన్ కాచెర్ల లక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ డెస్క్, వెరిఫికేషన్ డిస్క్, సర్వీస్ రిక్వెస్ట్ , ఆధార్ సెంటర్ డెస్క్, జగనన్న చెబుతాం డెస్క్, ఫస్ట్ ఎయిడ్ డేస్కు మొదలగునవి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం రెండు క్యాంపులలో 11 రకాల సర్వీస్ రిక్వెస్ట్ లకు సంబంధించి 3,678 సేవలను ఉచితంగా చేయడం జరిగిందన్నారు. ఈ రెండు క్యాంపుల వద్ద 3,754 మంది ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఒక వరంలాగా మారిందన్నారు. ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా రోజులు నెలలు తరబడి ఉండేవని, కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పేద ప్రజలకు సేవ చేయడానికి ఎంతో కృషి చేస్తుందని ప్రభుత్వం ప్రకటించే ప్రజా సంక్షేమ పథకాలను అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆనంద్, మున్సిపాలిటీ డి ఈ వన్నూరప్ప, వార్డు కౌన్సిలర్లు రామకృష్ణమ్మ, శంకర తేజ, ఒకటవ, మూడవ సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.