ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన సంచలనంగా మారింది. మూడు రోజుల క్రితం రాసిన బెదిరింపు లేఖ బయటకు రావడంతో దీని వెనుక విద్రోహచర్య ఉందనే ప్రచారం నడుస్తోంది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాద ఘటన, మూడు రోజుల క్రితమే వచ్చిన బెదిరింపు లేఖపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. రైలు ప్రమాదానికి, ఇటీవల వచ్చిన లేఖకు సంబంధం లేదని రైల్వే సీపీఆర్వో ప్రకటన విడుదల చేశారు. అగంతకుడి లేఖపై విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత కారణాలు చెప్పగలమని స్పష్టం చేశారు. ఈ లేఖపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలానికి చేరుకుని సహయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర డీజీపీ స్పందించారు సహాయకచర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ట్వీట్ చేశారు. అటు ఈ ఘటనపై సమాచారం కోసం 36912, 82819 టోల్ ఫ్రీ నెంబర్లను రైల్లే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్-రేపల్లె , సికింద్రాబాద్-మన్మాండ్ అజంత ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు. ఇక సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్(వయా కాజీపేట- విజయవాడ), సికింద్రాబాద్-ఫలక్ నుమా(వయా కాజీపేట, విజయవాడ), విశాఖ-లింగంపల్లి జన్మభూమి (వయా విజయవాడ, కాజేపీట), నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ప్రెస్(వయా విజయవాడ-కాజీపేట), సికింద్రాబాద్-తిరువనంతపురం(వయా కాజీపేట, విజయవాడ) దారి మళ్లించారు.