టీడీపీ నేతలు జోష్యం
విశాలాంధ్ర, పెద్దకడబూరు : రాబోయే 2024లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు, మాజీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి, టీడీపీ నాయకులు కేఈ ప్రభాకర్, మీనాక్షి నాయుడు, కేఈ శ్యామ్ బాబు, నరవ రమాకాంతరెడ్డి, నరవ శశిరేఖ జోష్యం చెప్పారు. శుక్రవారం భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార బస్సు యాత్ర మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరు మండల పరిధిలోని తారాపురం, రంగాపురం, చిన్నకడబూరు, పెద్దకడబూరు, గంగులపాడు, దొడ్డిమేకల, హెచ్ మురవణి, నాల్గవ మైలు రాయి మీదుగా టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ముందుగా తారాపురం గ్రామంలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో టీడీపీ నేతలు ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలను ఇచ్చిన జగన్ గద్దెనెక్కిన తర్వాత హామీలలో కోతలు విధిస్తున్నారని మండ్డిపడ్డారు. రైతుల పరిస్థితి దాయనీయంగా మారిందన్నారు. జగన్ పాలనలో రైతులు వ్యవసాయ కూలీలుగా మారారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ పథకాల పేరుతో వేల కోట్లు వెనుకేసుకొని దేశంలోనే అధిక ముఖ్యమంత్రిగా ఘనత సాధించారని ఆరోపించారు. జగన్ సైకో పాలనతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయాని గుర్తు చేశారు. మంత్రాలయం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి ఇసుక మాఫియా, పంచాయితీలకు ఇచ్చిన ప్రాధాన్యత నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఇసుక మాఫియాతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగలను ఆదుకొనేందుకు ప్రత్యేకమైన పథకాలు మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ నీరు, పూర్ టు రిచ్ వంటి వాటిని ప్రకటించారని, వాటి లబ్ధీని ప్రజలకు వివరించారు. 2024లో మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరాలని, తిక్కారెడ్డిని అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకేపోగు ప్రభాకర్, గుడిసె కృష్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, దివాకర్ రెడ్డి ఏసేపు, బసలదొడ్డి ఈరన్న, మల్లికార్జున, జ్ఞానేష్, పన్నాగ వెంకటేశప్పస్వామి, కొట్రేష్ గౌడ్, గౌళ్ల నరసన్న, దశరథ రాముడు, భరత్ కుమార్ కౌశిక్, బాబు రావు, ప్రతాప్ రెడ్డి, నరసింహరెడ్డి, సత్యగౌడ్, మల్దకల్, సర్దార్ భాష,వెంకటరామిరెడ్డి, నర్సిరెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.