చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం పట్టు చీరల వ్యాపారస్తులపై బాకీ అడిగినందుకు విజయవాడకు చెందిన ఆలయ సిల్క్స్ యజమాని అవినాష్పై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం పట్టుచీరల వ్యాపారస్తులు కోటం ఆనందలపై విజయవాడకు చెందిన ఆలయ సిల్క్స్ యజమాని అవినాష్ బట్టలు విప్పి, శారీరకంగా హింసించడం చాలా దారుణం అన్నారు. అవినాష్ వైఎస్ఆర్సిపి నాయకుడు కావడంతో పోలీసులు కేసు కట్ట లేకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. వెంటనే అవినాష్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, తదుపరి పోలీసులు, అధికారులు ఆ నిందితుని తక్షణమే శిక్షించి, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని, అట్లు లేనియెడల జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినాష్ ను ధర్మవరమునకు తీసుకొని వచ్చి, క్షమాపణ చెప్పించి చట్టపరంగా శిక్ష పడేటట్లు చూస్తామన్నారు.