ఎమ్మార్పీఎస్ నాయకులు
విశాలాంధ్ర – ధర్మవరం : ఎమ్మార్పీఎస్ అభివృద్ధికి అందరూ ఐక్యంగా పోరాడితేనే తప్పక విజయం చేకూరుతుందని ఎమ్మార్పీఎస్ నాయకులు భూదెప్ప, రామాంజనేయులు, శివప్రసాదులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ఐసిఐసి బ్యాంక్ వద్ద జెండాను ఆవిష్కరించి, స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఎం ఆర్ పి ఎస్29 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇప్పటికే అనేక పోరాటాలు సల్పి, విజయోత్సవములో ముందుకు వెళుతుందని, ప్రభుత్వాలు మారినా, ఎంఆర్పిఎస్ జీవన విధానం మార్పు రాలేకపోవడం, అభివృద్ధి కూడా ప్రభుత్వాలు చేయుత ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. మాల, మాదిగ కులస్తులు ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారని, డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనాలను అమలు పరచలేక పోవడం దారుణమన్నారు. నాటికి నేటికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, నారాయణ, నరసింహ, వరప్రసాద్, పవన్ కుమార్, పెద్దన్న, కమ్మరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.