విశాలాంధ్ర,సీతానగరం: సోమవారంనాడు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలంలో ప్రారంబమయ్యే టిడిపి బస్సు యాత్రలో మండలంలోని టిడిపి నాయకులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు రౌతు వేణు గోపాలనాయుడులు పిలుపు నిచ్చారు .శనివారం మండలంలోని సాల హరిగోపాల్ ఇంటివద్ద టీడీపీ నాయకులు సమావేశమై బస్సుయాత్ర గూర్చి మాట్లాడారు.మండలంలోని లచ్చయ్యపేట వద్ద ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార పరిశీలన, దీనిపై రైతులతో చర్చ ఉంటుంది తెలిపారు.అనంతరం సీతానగరం సువర్ణముఖి నదిపై నిల్చిన వంతెన నిర్మాణపనులు పరిశీలన చేస్తారని తెలిపారు. బస్సుయాత్రలో రాష్ట్ర నేతలు, ఉత్తరాంధ్ర నేతలతోపాటు జిల్లాలోని
నాలుగు నియోజక వర్గాల టీడీపీ నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో సాల హరిగోపాల్, తేరేజమ్మగరికయ్య, బుడితి శ్రీను, సబ్బాన శ్రీను, వాకాడ పారినాయుడు, బొత్స వెంకటనాయుడు, దాసరి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.అనంతరం వారంతా లచ్చయ్యపేటవెళ్లి మీటింగు స్థలంను పరిశీలించారు.