మెడికల్ ఆఫీసర్ పుష్పలత
విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ పుష్పలత ఆధ్వర్యంలో శ్రీ మాదన్న ట్రస్టు సహకారంతో, హై రిస్క్ గర్భవతులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ పుష్పలత మాట్లాడుతూ ప్రతినెల శ్రీ మాదన్న ట్రస్టు సహకారంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. దర్శనమలలో ప్రమాద సూచిక గల గర్భవతులు 21 మంది పాల్గొనడం జరిగిందని, మొత్తం గర్భవతులు 61 మంది రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి పి పి ఐ యు సి డి పి, పి ఎం ఎం రర్ వై, నార్మల్ డెలివరీలు, జీడీఎం, టిబి ,హెచ్ఐవి, సిఫిలిస్ ల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కళావతి ఆరోగ్య సిబ్బంది ట్రస్టు సభ్యులు చంద్రమోహన్, బాలాజీ, శేషరాజు, నరసింహ, చంద్ర, సుబ్బరాయుడు, లక్ష్మి నరసమ్మలు పాల్గొన్నారు.