స్పందన హాస్పిటల్ నిర్వాహకులు. డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని సాయి నగర్లో గల స్పందన హాస్పిటల్లో ఈనెల 12వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉచిత సంతాన సాఫల్య పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా హాస్పిటల్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉచిత సంతాన సాఫల్య పరీక్ష శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఎంతోమందికి ఫలితం కూడా లభించడం మాకెంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. మీ ఆశలను శాస్త్ర విజ్ఞానం అనుభవం నైపుణ్యముతో సఫలీకృతం చేయడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. ప్రముఖ పెరిటి స్పెషలిస్ట్ డాక్టర్ ప్రియాంక రెడ్డి చేత సంతాన సాపల్లెపై వైద్య చికిత్సలతో పాటు తగిన మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఐవిఎఫ్ ప్యాకేజీలపై తగ్గింపు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సంతానం లేని వారు సంప్రదించి, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.