జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : చేనేత వ్యాపారస్తులకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ వ్యాపారస్తుడు అవినాష్ గుప్తా ధర్మారం వ్యాపారస్తులైన కోట మహానంద్ గిర్రాజు శశిధర్లపై బైశాచికంగా దాడి చేయడంపై వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దాదాపు 2000 మంది పట్టణ వ్యాపారస్తులు చేస్తున్న ర్యాలీకి తన మద్దతును, సంఘీభావాన్ని తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. దాడి చేసిన అవినాష్ గుప్తాకు కఠిన శిక్షలు పడేంతవరకు జనసేన పార్టీ నిరంతరం పోరాటం సంపుతుందని చేనేత వ్యాపారస్తులకు వారు హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, సీనియర్ నాయకులు రాజారెడ్డి, లింగాల ప్రకాష్ రెడ్డి, కార్యనిర్వాహన కమిటీ సభ్యులు కోటికి రామాంజి, వెంకటేష్, బండ్ల చంద్రశేఖర్, కడపల సుధాకర్ రెడ్డి, మిరియాల లక్ష్మీనారాయణ, దాము, రామకృష్ణ నాయక్, వడ్డే రవి, హరి, కాశిం తదితరులు పాల్గొన్నారు.