విశాలాంధ్ర – పాచిపెంట : బీజామృతంతో విత్తన శుద్ది పంటలకు మేలని ఏపీసీఎన్ఎఫ్ జూనియర్ ప్రాజెక్ట్ ఎక్జిక్యూటివ్ మంతిని మానస, ఎన్ ఎఫ్ ఏ శారద, ఎంటి యశోద, బాలకృష్ణలు తెలిపారు.పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలంలోని కోనవలస గ్రామంలో మంగళవారం రైతులతో సామూహిక విత్తనశుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. బీజామృతంతో విత్తనాలను ఎలా శుద్ధిచేయాలో వివరించారు. ఖరీఫ్ లో సాగు చేసే ప్రతి పంట విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేయడం ద్వారా మొలక శాతం పెరగటంతో పాటు హానిచేసే సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభిస్తుందని, ఫలితంగా దిగుబడి పెరుగుతుందని అన్నారు. వరి, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజలు మొదలగు పంటలకు తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలని సూచించారు.