షికారులకు అండగా సంచార జాతుల మహిళా సంఘం…
విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో పూర్తి అనగారిన వర్గాలలో షికారులు ఉన్నారని షికారులను ఏ ప్రభుత్వం పట్టించుకునే నాధుడు లేరని ఏపీ సంచార జాతుల మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా దేవి అన్నారు. బుధవారం ఏపీ సంచార జాతుల మహిళా సంఘం కార్యాలయంలో వంద మంది మహిళా షికారులకు రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రాక్షల ఇందిరా దేవి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఏపీ సంచార జాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రాక్షల పుల్లయ్యప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…షికారిలు కడు పేదరికంతో వారి నివాసాలు మురికినీరు నిల్వల మధ్య జీవించడం చాలా ధారునం అన్నారు,అధికారులు వీరి నివాస ప్రాంతాలపట్ల తీవ్ర నిర్లక్ష్యం వల్ల మురికి కుప్పలుగ తయారయ్యాయని అన్నారు.వీరి పిల్లలకు అమ్మవడి ఒక్కరికి కూడ జమకాలేకపోవడం అధికారుకు సిగ్గుచేటు అని విమర్శించారు. షికారీ కాలనీకు మౌళిక సౌకర్యాలు,హౌసింగ్ ద్వార ఇల్లు నిర్మాణం ప్రభుత్వమే చేపట్టాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో జానకి,రత్న,రిజ్వాన,సుంకర గోవిందమ్మ,రాజమ్మ,శివమ్మ,నరసమ్మ తదితరులు, షికారి మహిళలు పాల్గొన్నారు.