విశాలాంధ్ర-గుంతకల్లు : అనంతలో జరుగుతున్న భూస్వాముల అవినీతిని అరికట్టేందుకు వెంగమ నాయుడు కమ్యూనిస్టు పార్టీలో పోరాటయోధుడిగా నిలిచి ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలబడిన ఆయన్ను అనంత నడిబొడ్డులో దుండగల చేతిలో దారణ హత్యకు గురయ్యారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు అన్నారు. బుధవారం స్థానిక బీటి పక్కిరప్ప భవనం సిపిఐ పార్టీ కార్యాలయంలో వెంగమ నాయుడు 26వ వర్ధంతి ని సిపిఐ ముఖ్యఅతిథి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డి గౌస్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా బి.గోవిందు మాట్లాడుతూ…అనంత పోరాట యోధుడు వెంగమ నాయుడు అని అన్నారు.ఆయన 1950లో కమ్యూనిస్టు పార్టీలో చేరి 1972 నుంచి 1992 వరకు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారన్నారు.జిల్లాలో అనేక పెత్తందారీలు, భూస్వాములపై పోరాట ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రజల సమస్యలు తీర్చిన వ్యక్తిని తెలిపారు. భూమికోసం భుక్తి కోసం శ్రమజీవుల కోసం వ్యవసాయ కూలీల కోసం అనేక సాయుధ పోరాటాలు చేసిన వెంగమ నాయుడు 1997లో దారుణ హత్యకు గురైన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,రైతు సంఘం నియోజవర్గం కార్యదర్శి రామాంజనేయులు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లాయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, ప్రజానాట్యమండలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, పుల్లయ్య,సీపీఐ నాయకులు మొరళికిృష్ణ,చిదాంబరం,నాగేంధ్ర,నరసయ్య,గురుస్వామి,ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకట నాయక్, ఏ ఐ వై ఎఫ్ నాయకులు నందు తదితరులు పాల్గొన్నారు.