మండల ప్రత్యేక అధికారి చాంద్ బాషా
విశాలాంధ్ర -ధర్మవరం : జగనన్న సురక్ష పేదలకు శ్రీరామరక్ష అని మండల ప్రత్యేక అధికారి చాంద్బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని ఏలుకుంట్ల, నేలకోట పంచాయతీలలో ఏర్పాటుచేసిన జగనన్న సురక్ష కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ గ్రామాల సర్పంచులు ప్రవీణ గోపిరెడ్డి, రమీబాయి, ఎంపీటీసీ సభ్యులు మాధవి అధ్యక్షులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి చాంద్బాషా మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అందరూ కలిసి ఇంటింటికి తిరిగి, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 11 రకాల సర్వీసులను గూర్చి వివరించి, అవగాహన చేసి, వారి ద్వారా అర్జీలను తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం మూడు గ్రామపంచాయతీలకి కలిపి 610 సర్వీసులను పూర్తి చేయడం జరిగిందని, తదనంతరం సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సౌజన్యకుమారి, మమతా దేవి, గ్రామ పెద్దలు ఓబి రెడ్డి,వెంకటేష్ నాయక్, కేశవ, గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శి చంద్రిక,మురళి తో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.