విశాలాంధ్ర -ఆలూరు : ఆస్పరి మండలం, నగరూరు గ్రామంలో కొలిచేవారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సద్గురు శ్రీ మహాదేవప్ప తాత దేవాలయం అభివృద్ధి కోసం రూ. 75 వేలును కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి విరాళంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో గ్రామ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావనను కలిగి ఉండాలన్నారు. దేవాలయం అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని, మంత్రి ఆదేశాల మేరకు నగదు అందజేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నగరూరు గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ తనయుడు మాజీ ఎంపీటీసీ మురళీమోహన్, ఉప సర్పంచ్ సత్యన్న, గ్రామ పెద్దలు ఎర్రిస్వామి, మద్దిలేటి, రమేష్, వైయస్సార్సీపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.