ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు. పోతలయ్య
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని హాస్టల్లో గల సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య నియోజకవర్గ అధ్యక్షులు శివ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి పట్టణంలోని ఎస్సీ స్కూల్ హాస్టల్ విద్యార్థులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకుని, హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రించడం జరిగిందని వారు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు హాస్టల్ విద్యార్థులకు అందేలా తమ పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు యాసీన్, మురళి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.