విశాలాంధ్ర, పెద్దకడబూరు : పెద్దకడబూరు మండల స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కో ఆర్డినేటర్ గా నారాయణ గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ గా 8 సంవత్సరాలు పని చేసేటట్లు తెలిపారు. 2018 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం తమను విధుల నుంచి తొలగించిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా తాము కలిశామని, ఇందుకు స్పందించి తాము అధికారంలోకి వస్తే మిమ్ములను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు స్వచ్ఛ భారత్ లో అవకాశం కల్పించారని తెలిపారు. నన్ను, నా కుటుంబాన్ని ఆదుకొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కి రుణపడి ఉంటామన్నారు. అలాగే ఎంపీపీ శ్రీ విద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి కి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి కి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, రవి చంద్రారెడ్డి, విజయేంద్ర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు మరియు ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈఓఆర్డి జనార్ధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని ఆయన అన్నారు.