విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణములోని కొత్తపేట- లక్ష్మీ నగర్ లో వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని ఫ్యాన్స్ దేశానికి చెందిన ఐదు మంది విదేశీ భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారైనా సైతం గోవిందు శంకర అప్ప స్వామి వారికి ఘన స్వాగతం పలుకుతూ, వారి పేరిటన ప్రత్యేకంగా అర్చనలు, పూజలు నిర్వహించి ప్రసాదమును పంపిణీ చేశారు. అనంతరం విదేశీ భక్తులు మాట్లాడుతూ భారత దేశ సాంప్రదాయ పద్ధతులు మాకు బాగా నచ్చాయని, భారతదేశ పర్యటనలో భాగంగా ధర్మారం కూడా రావడం జరిగిందని వారు తెలిపారు. ఇక్కడి ప్రజలు భగవంతుని ఆరాధించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు.