విశాలాంధ్ర,సీతానగరం: జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామాల్లో కొత్తగా మంజూరు చేసిన దృవీకరణ పత్రాలని ఎమ్మెల్యే జోగారావు చేతుల మీదుగా అందజేసారు.గురువారం మండలంలోని జోగమ్మపేట, కాసాపేట గ్రామ సచివాలయాలలో జరిగిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమాలలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగనన్న సురక్ష ద్వారా 11రకాల దృవీకరణ పత్రాలను పొందే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కొత్తగా మంజూరు కాబడిన 11రకాల సేవల దృవీకరణ పత్రాలను అందజేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్, తహశీల్దార్ ఎన్వీ రమణ,డిప్యూటీ తహశీల్దార్ చిట్టెమ్మ, ఈఓపిఆర్డీ వర్మ,ఆర్ ఐ శ్రీనివాసరావు, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటిసి మామిడి బాబ్జి, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు, పోల ఈశ్వర నారాయణ, తెంటు వెంకట అప్పల నాయుడు,సర్పంచులు కె.సింహాచలం, తేలు దనంజయమ్మ సత్యంమాస్టారు, చింతల లక్ష్మణరావు, బంకురు శ్రీహరినాయుడు, సెక్రటరీలు కిరణ్ కుమార్, మురళి,శ్రీనివాసరావు, సంతోష్ కుమార్,పైడిరాజు, మండల అధికారులు,మండల ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు,సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, అంగన్వాడీ, ఆశాకార్యకర్తలు, గ్రామస్తులు లబ్దిదారులు