విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ 2వ వార్డు తిమ్మాపురం ఇందిరమ్మ కాలనీలో రోడ్లు డ్రైనేజీ లేక అస్తవ్యస్తంగా ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించకపోవడంతో శనివారం కాలనీవాసులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రమేష్, 3వ వార్డు కౌన్సిలర్ గిరి మాట్లాడుతూ కాలనీ ఏర్పడి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతున్న కాలనీలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇందిరమ్మ కాలనీ అంటేనే అధికారులు వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా కాలనీలో సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా కొనసాగిస్తామని చెప్పడంతో అక్కడికి సీఐ కరుణాకరన్ పోలీస్ సిబ్బంది వచ్చి రమేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ కి వినతి పత్రం అందజేస్తూ డ్రైనేజీ ,రోడ్లు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రియాజ్, సికిందర్, బాబా,ప్రశాంత్, వేణు, అశ్వత్ తప్ప, నాగరాజు, చలపతి, రామాంజనమ్మ, తదితరులు పాల్గొన్నారు.