విశాలాంధ్ర – కర్నూలు సిటీ : వాతావరణ సమతుల్యత,పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి,వాటిని సంరక్షించాలని నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ అల్తాఫ్ పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరం మాధవ నగర్ నారాయణ పాఠశాలలో ఆ విద్యాసంస్థల ఏజిఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు కిడ్స్,ఈ క్యాంపస్ విభాగం విద్యార్దులు నిర్వహించిన వనమహోత్సవం ర్యాలీని ప్రిన్సిపాల్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు స్కూల్ సమీప కాలనీ వాసులకు మొక్కల పెంపకం పర్యవరణం వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారనీ, మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహించలన్నరు. మొక్కలు పర్యావరణ కాలుష్యము, సమతుల్యతను మరుస్తాయనీ, మొక్కలు అంతరిస్తే ప్రమాదం సంభవిస్తుందని తెలిపారు. ఆనంతరం స్కూల్ అవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఐ దుర్గాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరి, రాధ, నాగరాజులు పాల్గొన్నారు.