విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కిసాన్ అగ్రి క్లినిక్ పురుగుల మందుల దుకాణము పై శనివారం ఉదయం జిల్లా విజిలెన్స్ వ్యవసాయ అధికారి వాసు ప్రకాష్ , మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, సబ్ ఇన్స్పెక్టర్ శేషగిరి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు భాగంగా స్టాక్ వివరాలను తనిఖీ చేయగా భౌతిక నిల్వలో రూ.28,790 లు విలువ గల పురుగుమందుల విక్రయాలను నిలుపుదల చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ డీలర్లు అందరూ తప్పనిసరిగా రైతులకు రసీదులు అందజేయాలని అనుమతులు గల ఎరువులు పురుగులు మందులు మాత్రమే విక్రయించాలని తెలిపారు. తదుపరి ఎరువుల దుకాణం నందు ధరల పట్టిక స్టాక్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. నియమ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.