మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి భర్త కాచర్ల అంజి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ పదవిని చేపట్టిన కాచర్ల లక్ష్మి దంపతులకు పట్టణంలోని శివానగర్ అభయ హస్త చౌడేశ్వరి దేవాలయంలో శనివారం ఆరవ వార్డు చేనేత ప్రముఖులు దేవాలయ కమిటీ మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు దంపతుల పేరిటన ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, ఘనంగా వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శంకర యుగంధర్, బాలం చౌడయ్య, పెద్దకోట్ల చౌడయ్య, చేనేత ప్రముఖులు సిద్ధి రాజేష్, బాలంమూర్తి, సైదం అంజి తదితరులు పాల్గొన్నారు.