విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ: ఎస్కేయూ 21వ స్నాతకోత్సవం గవర్నర్ ప్రసంగ కాపీలు ఎస్కేయూ సమాచార విభాగం నిర్లక్ష్యం వైఖరి అనుసరించడం పట్ల మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా స్నాతకోత్సవం గవర్నర్ ప్రసంగానికి అరగంట ముందు మీడియాకు ప్రసంగ పత్రాలను అందజేస్తారు. కానీ నిబంధనలు అనుసరించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తన ధోరణి ఉందన్నారు. పాత్రికేయులు పలుమార్లు అధికారులను అడిగిన ఇవ్వకపోవడంతో వెనుదిరిగే పరిస్థితి నెలకొన్నది.