విశాలాంధ్ర – జెఎన్టియుఏ:ఎస్కేయూ 21వ స్నాతకోత్సవం ముగియడంతో గవర్నర్ నజీర్ తిరుగు ప్రయాణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురం నగరంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించిన రాష్ట్ర ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ మేడా రామలక్ష్మి పుష్పవతి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం .గౌతమి ఎస్పి కంచె శ్రీనివాసరావు పాల్గొన్నారు.