మాజీ వైస్ చైర్మన్ మాసపల్లి సాయికుమార్
విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని గొట్లురు అనాధాశ్రమంలో సోమవారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్, మాసపల్లి సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం పంపిణీ చేశారు. తొలుత వృద్ధుల నడుమ అనంతరం కేకు కటింగ్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. తన పుట్టినరోజును ఇలా జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. అనంతరం వృద్ధులు సాయికుమార్ ను ఆశీర్వదించారు. తదుపరి ఆశ్రమ వ్యవస్థాపకులుగా చంద్ర సాయికుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎల్లయ్య, సురేష్, జ్యోతి, మల్లికార్జున, ఓంప్రకాష్ , రాజా, అశోక్ ,మురళి, కాసెప్ప ,కుమారు, రాము, దందు, శీన, గజ్జల శివ తదితరులు పాల్గొన్నారు.