విశాలాంధ్ర వలేటివారిపాలెం : మండలంలోని పోలినేని చెరువు గ్రామంలో గ్రామ సర్పంచి యాళ్ల రాజ్యలక్ష్మి మరియు కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు పి.అనసూయ అధ్వర్యంలో రైతులకు కంది రకం ఎల్ ఆర్ జీ 52 మిని కిట్స్ 100శాతం రాయితీపై బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయాధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ మండలానికి మొత్తం 3 క్వింటాల్లు మంజూరు అయినవని ఇవి మండలంలోని పోలినేని చెరువు, వలేటివారిపాలెం, అంకభూపాలపురం గ్రామాలకు అవసరమైన రైతులకు పంపిణీ చేస్తామని అన్నారు, గ్రామ రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విత్తనాలను విత్తన శుద్ధి చేసి , అంతర పంటలు గా సజ్జ, లేదా మినుము, లేదా పెసర లేదా అలసందలు వేసి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలని సూచించారు. అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులు పి.
అనసూయ మాట్లాడుతూ రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు ఎరువుల జనుము , పిల్లి పెసర వినియోగం వల్ల కలిగే ఉపయోగాలు వివరించారు, మరియు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న రైతులు అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సిహెచ్.రవీంద్ర మరియు కైపు మల్యాద్రి, శనివారపు మాలకొండయ్య మరియు రైతులు పాల్గొన్నారు.