Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టండి..

వామపక్ష, అఖిల పక్ష, ప్రజా రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు.
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం వారు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్ష అఖిలపక్ష ప్రజా రాజకీయ ప్రజా సంఘాల నాయకులు బుధవారం డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డికి ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్జెఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇర్షాద్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, ఎస్జెఎస్ ఎఫ్.జిల్లా నాయకులు ప్రదీప్లు మాట్లాడుతూ
ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వా నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ఫీజుల దోపిడి చేస్తున్నారు అని, వారి యొక్క పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాయని, లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారనీ, కాబట్టి వారిపై చర్యలు తీసుకొని,ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని, పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారాన్ని తగ్గించగలరని వారు తెలిపారు. ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంపై పలుమార్లు మేము వినతి పత్రాల ద్వారా విద్యాశాఖ అధికారులకు విన్నవించుకున్నా కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మీరైనా విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ముగాస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్, పట్టణ నాయకులు నంద కిషోర్, త్రివిక్రమ్,ప్రకాష్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తిరుమలేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img