విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని మరూరు గ్రామానికి చెందిన కంసలి వెంకటేష్ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. వైయస్సార్ బీమా పథకంలో భాగంగా తాత్కాలిక ఉపశమనం కింద ప్రభుత్వం తరఫున వెంకటేష్ తల్లి శాంతమ్మకు రాప్తాడు జడ్పిటిసి పసుపుల హేమావతి బుధవారం రూ. 10,000వేలు తక్షణ సాయం అందజేశారు కార్యక్రమంలో ఎస్సీ, బీసీ సెల్ మండల కన్వీనర్ నారాయణస్వామి, పసుపుల ఆది, సొసైటీ చైర్మన్ మరూరు కొండారెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెల్ఫేర్ అసిస్టెంట్ నరసింహులు ఉన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ నరసింహులు మాట్లాడుతూ వైయస్సార్ బీమా మొత్తాన్ని కుటుంబంలో ఆర్థిక తోడ్పాటు ఇచ్చే వ్యక్తికి వర్తింప చేస్తారన్నారు బీమా తీసుకునే వ్యక్తి బియ్యం కార్డులో సభ్యుడై ఉండాలన్నారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు సహజమరణం పొందితే రూ.లక్ష, 18 నుంచి 70 ఏళ్ల లోపు ఏదైనా ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా రూ.5లక్షలు వైఎస్సార్ బీమా అందజేస్తారన్నారు. కాగా పథకానికి సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేసుకునేందుకు 155214 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచారన్నారు.