విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములోని గుట్ట కింద పల్లికి చెందిన నితిన్ కుమార్ జూన్ 9వ తేదీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరామర్శించడంతోపాటు, గురువారం నాడు తన స్వగృహంలో సతీమణి సుప్రియ చేతులమీదుగా 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారు అందించారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యం అని, అనుకోని సంఘటన వలన మృతి చెందిన కుటుంబాలకు తాను సంతాపం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ ఎల్లప్పుడు ఆ కుటుంబాలకు అండదండలుగా ఉంటుందని భరోసా తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు సుప్రియ కు కృతజ్ఞతలు తెలియజేశారు.