విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : అనంతపురం పాలిటెక్నికల్ కళాశాలలో 1993-96 సం.లో విద్యాభ్యాసం చేసి 30 ఏళ్ల అనంతరం కళాశాలకు చేరుకున్న విద్యార్థులు రామకృష్ణ, చాంద్ లింగమయ్య ,భాష అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వాట్సాప్, ఫోన్ కాల్ సందేశాలతో సంతృప్తి చెందకు పోవడంతో అందరూ ఒకే వేదికపై కలుద్దామని నిర్ణయించుకుని కళాశాలకు గురువారం చేరుకుని బోధించిన అధ్యాపకులు ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి కి పాదాభివందనం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. వివిధ దేశాలలో స్థిరపడిన జ్ఞాన సంపాదన అందించిన కళాశాల, అధ్యాపకుల బోధన ఎప్పటికీ మరువమని అన్నారు. కళాశాల అభివృద్ధికి మేదో సంపద, ఉపాధి కల్పన, ఆర్థిక వనరులను అందించి తోడ్పాటును ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.