విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం నియోజక వర్గంలో ఐటీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ టీడీపీ యాప్ లో పదివేలు పాయింట్లు సాధించిన పురపాలక సంఘం 8వ వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావును అభినందిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందన ఉత్తరాన్ని పంపించారు. టీడీపి పార్టీ కార్యక్రమాలు తెలియజేయడం, అధికార పక్ష అన్యాయాలు యాప్ ద్వారా అందరికీ తెలియజేయడంలో సైనికుడు వలే కష్టపడి పనిచేస్తున్న నారాయణరావు కృషిని అభినందించారు. ఆయనతో పాటు నియోజక వర్గంలో పార్వతీపురం గ్రామీణ ప్రాంతానికి చెందిన నీలాపు చంటి (చలమ వలస) కూడా ఐటీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నందున, క్రియాశీలకంగా ప్రసార మాధ్యమాల ద్వారా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నందున అతడిని కూడా అభినందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ పంపారు.వారిద్దరినీ నియోజక వర్గంలోని నేతలు, మూడుమండలాల టిడిపి నాయకులు,కార్యకర్తలు అభినందించారు.