విశాలాంధ్ర,సీతానగరం : మండలంలోని పెదబోగిలి మేజర్ పంచాయతీలోని1,2 గ్రామసచివాలయంలలో శనివారం నాడు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని ఎంపిడిఓ ప్రసాద్ తెలిపారు.బుదవారం ఆయన ఆయా గ్రామాల పరిధిలో సచివాలయం సిబ్బందితో, వాలంటీర్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అర్హులైనలబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేయడానికి సిద్ధంగా ఉండాలని. వెంకటపురంను సందర్శన మండలంలోని వెంకటపురం గ్రామంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు నిర్వహించిన ఇంటింటికి సురక్ష కార్యక్రమం అవగాహనలో ఎంపిడిఓ ప్రసాద్ పాల్గొన్నారు. అర్హులైనలబ్ధిదారులకు ప్రభుత్వం తెలిపిన 11రకాల దృవీకరణ పత్రాలకోసం దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి మంజూరు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బుడితి శ్రీనివాసరావు, బుడితి ముకుంద, బుడితి గౌరునాయుడు తదితరులు