ఉప ఎన్నికల తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని 4 మండలాలలో గల 287 పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓ లు, బి ఎల్ ఏ ల ఆధ్వర్యంలో అనుకున్న సమయానికి తప్పక పూర్తి చేస్తామని ఉప ఎన్నికల తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని పలు మండలాలలో ఆకస్విక తనిఖీలను నిర్వహించి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. తొలుత బి ఎల్ ఓ లు, బి ఎల్ ఏ లకు సమావేశం ఏర్పాటు చేసి సర్వేలో విధివిధానాలను తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం క్షుణ్ణంగా ఓటర్ జాబితా ప్రకారం ఇంటిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? తొలగించడం ఏమైనా ఉన్నాయా? చేర్పులు మార్పులు ఉన్నాయా? అన్న ప్రతి అంశాన్ని వారు పరిశీలించారు. బి ఎల్ వో లకు ప్రతిరోజు 35 ఓటర్లను టార్గెట్ గా ఇవ్వడం జరిగిందని, నేడు 287 పోలింగ్ కేంద్రాల్లో ఇంటిట ఓటర్ సర్వేలో 10,000 ఓటర్లను జాబితా ప్రకారం విచారణ సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు.