మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్న సురక్ష కార్యక్రమమని, 11 రకాల సర్టిఫికెట్లను నేటి ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు అందజేయడం గర్వించదగ్గ విషయమని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ తారకరామాపురం లోని శ్రీనివాస కళ్యాణ మండపము నందు జగనన్న సురక్ష కార్యక్రమమును మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి, కౌన్సిలర్లు మేడాపురం వెంకటేష్, రాయపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగాయి. ఎర్రగుంట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్సికేపురం, పార్థసారథి నగర్ ప్రజలకు, అదేవిధంగా శ్రీనివాస కళ్యాణ మండపంలో రాంనగర్, తారకరామాపురం ప్రజలకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి కౌన్సిలర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని, నవరత్న సంక్షేమ ఫలాలను అర్హత గల వారందరికీ అందించడమే ప్రభుత్వమే ఒక లక్ష్యం అని తెలిపారు. రాజకీయాలకు, కుల, మతాలకు అతీతంగా నేటి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాలే కాకుండా ప్రజల సమస్యలను అవసరాలను గుర్తించి పరిష్కార దిశగా జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని వారు తెలిపారు. ప్రజల యొక్క హక్కులను పొందే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి, కౌన్సిలర్ల చేతుల మీదుగా 4,694 సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. మొత్తం 5,576 సర్వీసులను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్..ఆనంద్, టి పిఆర్ఓ. సుబ్బరాయుడు, వార్డు కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.